చిరు + నాగ‌బాబు + ప‌వ‌న్‌ = ?

pavan chiru nagababuచిరంజీవిని, నాగ‌బాబునీ, ప‌వ‌న్ క‌ల్యాణ్‌నీ మిక్సీలో వేస్తే…?? ఎలా ఉంటుందో మ‌న‌కు తెలీదుగానీ, వైవిఎస్ చౌద‌రిని అడిగితే మాత్రం ఆ రూపం… సాయిధ‌ర‌మ్ తేజ్ అని చెబుతున్నాడు. రేయ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు సాయిధ‌ర‌మ్ తేజ్. ఈ మెగా హీరోని పుష‌ప్ చేయ‌డానికి, మెగా అభిమానుల్ని త‌న వైపుకు తిప్పుకోవ‌డానికి చౌద‌రి అన్ని ర‌కాలైన జాగ్ర‌త్తలు తీసుకొంటున్నాడు. ఈ సినిమాకి ఇప్పటికే భారీ ఎత్తున ఖ‌ర్చు పెట్టాడు. దాన్ని తిరిగి రాబ‌ట్టుకోవాలంటే… మెగా అభిమానుల అండ‌దండ‌లు ఉండాల్సిందే అని చౌద‌రి అభిప్రాయం. అందుకే ఈ సినిమా వేడుకల్లో మెగా హీరోల్ని ఇన్‌వాల్వ్ చేస్తూ – హైప్ క్రియేట్ చేస్తున్నాడు. ఆడియో పండ‌క్కి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ని అతిథిగా తీసుకొచ్చాడు. ఆ వేడుక గ్రాండ్ స‌క్సెస్ అయ్యింది. ఇప్పుడు సాయిధ‌ర‌మ్‌ని అభిమానుల‌కు ద‌గ్గర చేయాల‌నుకొంటున్నాడు. అందుకే సాయిని ముగ్గురు మెగా హీరోల‌తో పోల్చాడు. మ‌రి ఈ ఈక్వెష‌న్‌కి అభిమానుల రియాక్షన్ ఏమిటో మ‌రి?