అభిమాని మృతి.. వాయిదాపడ్డ ‘విరూపాక్ష’ టీజర్ రిలీజ్ !


‘విరూపాక్ష’ టీజర్ కోసం ఎదురుచూస్తున్న సాయిధరమ్ తేజ్ అభిమానులకు నిరాశే మిగిలింది. అధికారకంగా రిలీజ్ అవ్వడానికి ముందే ఈ టీజర్ పవన్ కళ్యాణ్ ప్రశంసలు అందుకున్న నేపథ్యంలో.. టీజర్‌పై అంచనాలు పెరిగాయి. అయితే మెగా అభిమాని, భీమవరం సాయిధరమ్ తేజ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రావూరి పాండు గత
మంగళవారం క్రికెట్ ఆడుతూ గుండె పోటుతో మరణించడంతో ఈ సినిమా టీజర్ రిలీజ్ వాయిదా పడింది. ఇకపోతే టీజర్ రిలీజ్ కు సంభందించిన కొత్త అప్డేట్ ను త్వరలోనే ప్రకటిస్తామని చిత్రబృందం వెల్లడించింది.

సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో సంయుక్తా మీన‌న్ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ప్ర‌ముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కార్తీక్ దండు ద‌ర్శ‌కుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో రిలీజ్‌కి స‌న్న‌ద్ధ‌మవుతుంది.