Site icon TeluguMirchi.com

Bro : ఫ్యాన్స్ కి సాయిధరమ్ తేజ్ విన్నపం..


పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న మూవీ ‘బ్రో’. ఈ సినిమా రేపు(శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఇక మెగా ఫాన్స్ అందరూ కూడా దీనికోసం తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ గా టికెట్స్ అన్నీ బుక్ కూడా అయిపోయాయి. ఒకపక్క భారీ వర్షాలు పడుతున్నప్పటికీ ఫ్యాన్స్ మాత్రం ఎలా అయినా సినిమా చూసేయాలని ఆతృతగా వున్నారు. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ అభిమానుల కోసం ఒక లెటర్ విడుదల చేశారు. వర్షాలు చాలా ఎక్కువ పడుతున్నాయి బ్రో.. జాగ్రత్తగా వుండండి అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

ఆ లెటర్ లో.. ‘ఇప్పటివరకు మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు చాలా చాలా థాంక్స్. సముద్రఖని దర్శకత్వంలో నేను, కళ్యాణ్ మామయ్య కలిసి నటించిన ‘బ్రో’ సినిమా రేపు విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంభందించిన బ్యానర్లు, కటౌట్ లతో మీరు పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. మీరు ఇష్టంగా చేసుకునే దాన్ని మేం కాదనలేము. అయితే ఆ సమయంలో మీరు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చాలా జాగ్రత్తగా ఉండాలని వేడుకుంటున్నాను. ఈ సంబరాల్లో మీకు ఏదైనా అయితే తట్టుకునే ధైర్యం నాకు లేదు. మీ క్షేమం కంటే నాకు ఏది ఎక్కువ కాదు. కాబట్టి మీరు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Exit mobile version