Site icon TeluguMirchi.com

ఆ సెట్‌లు చూస్తే భయపడతారు.. సాయిధరమ్ తేజ్


సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్, నటి సంయుక్తమీనన్ కలిసి నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే ఆదివారం (ఏప్రిల్ 16) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏలూరులోని సీఆర్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో

సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ..’మీ అందరి ప్రేమను పొందేందుకు ‘విరూపాక్ష’ సినిమాతో ఏప్రిల్ 21న వస్తున్నాం. మిమ్మల్ని అలరించాలని ఈ సినిమా చేశాం. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. అసలే హారర్ సినిమా అంటే నాకు భయం. కానీ కార్తిక్ అయితే ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారి సెట్‌లు చూస్తే ఆడియెన్స్ భయపడతారు. నాకు ఎంతగానో సపోర్ట్ చేసినందుకు అందరికి థాంక్స్. ఇకపోతే మా ముగ్గురు మామయ్యల వల్లే నేను ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను’ అన్నారు.

Exit mobile version