Site icon TeluguMirchi.com

లోకల్ తో ఫిదా పోరి..

Sai-nani

వరుస సక్సెస్ లతో జెట్ స్పీడ్ లో ఉన్న నాని..ప్రస్తుతం నిన్ను కోరి , ఎంసీఏ మూవీ లతో రాబోతున్నాడు..ఇప్పటికే నిన్ను కోరి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది..శివ నిర్వాణ అనే కొత్త దర్శకుడు ఈ మూవీ రూపొందిస్తుండగా జులై నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఇది ఇలా ఉండగా దిల్ రాజు బ్యానర్ లో నేను లోకల్ తర్వాత ఎంసీఏ అంటూ మరో మూవీ చేయబోతున్నాడు..

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఓ కొత్త సినిమాను మే నెలలో లాంఛ్ చేయనున్నాడు నాని. ఈ చిత్రంలో నాని సరసన మలయాళ ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవిని ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ఫిదా చిత్రంలో నటిస్తున్న సాయి పల్లవికి.. ఆ వెంటనే మరో క్రేజీ ఆఫర్ దక్కడం విశేషం. నాని-సాయి పల్లవి జంటగా నటిస్తుండగా హీరో శ్రీకాంత్ ఈ మూవీలో కీలక పాత్ర చేయనుండగా.. మాజీ హీరోయిన్ భూమికా సిస్టర్ రోల్ లో కనిపించనుందని తెలుస్తోంది.

దిల్ రాజు నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చనున్నాడు. మే నెల రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

Exit mobile version