అయోమయంలో సాయిపల్లవి సినిమా

నాగశౌర్య-సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన కణం సినిమా విడుదల కష్టాలు ఇంకా తొలగిపోలేదు. డిసెంబర్ నుంచి విడుదల మాట వినిపిస్తోంది కానీ ఇప్పటికి ఇంకా రాలేదు.

ఈ నెల 9న విడుదల పక్కా అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ మరో వారం, రెండు వారాలు వెనక్కు వెళ్లే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. థియేటర్ల బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అయోమయం ఏర్పడింది,

ఈ సినిమాలో ఓ చిన్నారికి తల్లిగా నటించింది సాయిపల్లవి. భ్రూణ హత్యలు, ఆ పిండం ఆత్మగా మారి తల్లిని చేరడం లాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కింది కణం. ఈ సినిమాకి విజయ్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. తమిళంలో ‘కరు’ టైటిల్‌తో సినిమాను విడుదల చేస్తున్నారు