డీజే: దువ్వాడ జగన్నాథమ్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ మళ్ళీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై దిల్రాజు నిర్మాత ఇంకొ సినిమాకి రెడీ అవుతున్నారు. ఇందులో ఇద్దరు యువ కథానాయకులు నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆ పాత్రలకు నాని, శర్వానంద్ ఎంపిక చేశారు.
ఇదీలావుంటే.. ‘దాగుడు మూతలు’ చిత్రం పూర్తికాగానే అరుణాచల్ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయనున్నాడు ఈ దర్శకుడు. ఈ చిత్రానికి ‘సీటీమార్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. మరో విశేషం ఏమిటంటే.,. ఈ సినిమాలో హీరోయిన్ లాక్ ఐయింది. సాయి పల్లవిని హీరోయిన్ గా ఫైనల్ చేశారు. దిల్ రాజు బ్యానర్ లో ఆమెకిది మూడో సినిమా.