Site icon TeluguMirchi.com

సాయి పల్లవికి వెరీ స్పెషల్

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘కణం’. ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్‌ సంస్థ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తయిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మార్చి 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ సందర్భమగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాయిపల్లవితో పాటు చిత్ర బృందం కూడా పాల్గొంది.

సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘‘కణం’ చిత్రం తల్లి, కూతురికి మధ్య ఉండే భావోద్వేగాల ఆధారంగా ఉంటుంది. ఈ చిత్రంలో నా కూతురిగా కనిపించే వెరోనికాతో చాలా సమయం గడిపాను. తాను నేను నిజంగానే తల్లి, కూతుళ్లలాగానే కలిసిపోయాం. అందువల్ల సినిమాలో కనిపించే ఎమోషన్స్‌ అన్ని చాలా సహజంగా ఉంటాయి. విజయ్‌గారికి ఏ సీన్‌కి ఎలాంటి ఎమోషన్‌ ఉంటే బాగుంటుందో బాగా తెలుసు. తల్లీకూతుళ్ల మధ్య సన్నివేశాలు సహజంగా ఉండాలనేవారు. ‘నన్ను మీరు యాక్ట్‌ చేయనివ్వట్లేదు’ అని కూడా అనేదా. అయితే, డబ్బింగ్‌ సమయంలో సినిమా చూస్తున్నప్పుడు అర్థమైంది ఆయన ఎందుకలా అనేవారో. నటిగా ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైంది’ అని చెప్పుకొచ్చింది.

Exit mobile version