Site icon TeluguMirchi.com

ధర్మాభాయ్ వెనుక వున్న కధ

వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ‘ఇంటిలిజెంట్’ .. రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సాయిధరమ్ తేజ్ .. ధర్మాభాయ్ పాత్రలో కనిపించనున్నాడు. తన పాత్రకి వినాయక్ ఈ పేరు పెట్టడం గురించి సాయిధరమ్ తేజ్ చెప్పుకొచ్చాడు.

”ధర్మా భాయ్ అనే పేరు ఎందుకు పెట్టారని వినాయక్ ను అడిగాను. దానికి వినాయక్ దగ్గర మంచి సమాధానం ఉంది. హీరోల ఒరిజినల్ పేర్లనే పెట్టడం నాకిష్టం అన్నారాయన. నాయక్ లో చరణ్ పేరు చెర్రీ అని పెట్టారు. ఖైదీనంబర్-150లో చిరంజీవి పేరు శంకర్ అని పెట్టేశారు. ఈసినిమాలో నా ఒరిజినల్ పేరు ధరమ్ తేజ్ అనే పేరునే వాడారు. ఆ పేరు నుంచే కథకు తగ్గట్టు ధర్మా భాయ్ అనే పేరు వచ్చింది”అని చెప్పుకొచ్చారు.

Exit mobile version