Site icon TeluguMirchi.com

మళ్ళీ గోపీచంద్ డైరెక్షన్ లో తేజు


‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్‌తేజ్‌ మరో సినిమా ప్రకటించాడు. త్వరలో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు. మే నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది వరకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమా చేశాడు సాయి ధరమ్‌తేజ్‌. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వి.వి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్‌’ కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు మళ్ళీ గోపీచంద్‌ మలినేనితో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version