మళ్ళీ గోపీచంద్ డైరెక్షన్ లో తేజు


‘ఇంటిలిజెంట్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాయి ధరమ్‌తేజ్‌ మరో సినిమా ప్రకటించాడు. త్వరలో గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో నటించబోతున్నాడు. మే నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది. శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇది వరకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో విన్నర్ సినిమా చేశాడు సాయి ధరమ్‌తేజ్‌. రకుల్ ప్రీత్ హీరోయిన్ గా వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా వి.వి వినాయక్‌ దర్శకత్వంలో వచ్చిన ఇంటిలిజెంట్‌’ కూడా నిరాశ పరిచింది. ఇప్పుడు మళ్ళీ గోపీచంద్‌ మలినేనితో చేస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.