Site icon TeluguMirchi.com

హీరోయిన్‌ భర్తతో సాయిధరమ్‌ తేజ్‌కు గొడవ!

sai (18)మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ వరుస చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. ఈయన ఇటీవలె ‘జవాను’ చిత్రాన్ని పూర్తి చేసి తదుపరి చిత్రం కోసం సన్నాహాలు షురూ చేశాడు. సాయిధరమ్‌ తేజ్‌ తదుపరి చిత్రాన్ని ‘శతమానం భవతి’ ఫేం సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో, దిల్‌రాజు నిర్మాణంలో నటించనున్నాడు. ఈ సంక్రాంతికి మంచి విజయాన్ని అందుకున్న ఈ కాంభోతో సాయిధరమ్‌ తేజ్‌ వచ్చే సంక్రాంతికి రానున్నాడు. ఈ చిత్రానికి ‘శ్రీనివాస కళ్యాణం’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. టైటిల్‌తోనే మంచి టాక్‌ను సొంతం చేసుకునే దిల్‌ రాజు ఈ టైటిల్‌ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

ఈ చిత్రంలో సాయిధరమ్‌ తేజ్‌తో తపడడానికి కొత్త విలన్‌ అయితే బాగుంటుంది అని దర్శకుడు చెప్పాడట. దాంతో నిర్మాత దిల్‌రాజు హీరోయిన్‌ స్నేహ భర్తను దృష్టిలో ఉంచుకుని స్నేహను సంప్రదించారట. వాస్తవానికి స్నేహ భర్త ప్రసన్నకు తమిళంలో కూడా పెద్దగా అవకాశాలు లేవు. దాంతో ఈ మధ్య విలన్‌లకు కూడా మంచి పాపులారిటీ ఉంది. అందుకే ప్రసన్న విలన్‌ పాత్ర చేయడానికి కూడా ఒకే చెప్పాడట. హీరోగా అవకాశాలు రాకున్నా కూడా విలన్‌గా ప్రతిభ కనబరిస్తే మంచి అవకాశాలు వస్తాయి అని స్నేహ ఇచ్చిన సలహాతో ప్రసన్న ఒకే చెప్పాడట. ఇక త్వరలోనే సాయిధరమ్‌ తేజ్‌ హీరోయిన్‌ భర్తతో తలపడనున్నాడు.

Exit mobile version