Site icon TeluguMirchi.com

‘జవాన్‌’ వాయిదా వెనుక దిల్‌రాజు..!

సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా మెహ్రీన్‌ హీరోయిన్‌గా బీవీఎస్‌ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్‌’ చిత్రం మరో 15 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ ఫ్యాన్స్‌ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు. ఒక్కటి కాదు రెండు కాదు ఏకంగా మూడు నెలల తర్వాత ‘జవాన్‌’ను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. నవంబర్‌లో ‘జవాన్‌’ను విడుదల చేస్తామని చెబుతున్నారు.

షూటింగ్‌ అంతా పూర్తి అయ్యింది అంటూ ప్రకటించి ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నారు అంటూ మెగా ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలోనే ఒక షాకింగ్‌ విషయం వెళ్లడైంది. దర్శకుడు రవి తెలివి తక్కువతనం కారణంగా సినిమాలో చాలా బొక్కలు ఏర్పడ్డాయి. అంటే పలు సీన్స్‌ సింక్‌ లేకుండా, పలు సీన్స్‌ అనవసరంగా ఉన్నాయి. అవసరం అయిన సీన్స్‌ లేకుండా ఉన్నాయట. దాంతో దిల్‌రాజు ఈ సినిమాలోని పలు సీన్స్‌ను రీ షూట్‌ చేయాలని, కొన్ని సీన్స్‌ కొత్తగా షూట్‌ చేయాలని దర్శకుడు, నిర్మాతలకు సలహా ఇవ్వడం జరిగింది.

దిల్‌రాజు జడ్జ్‌మెంట్‌ పక్కాగా ఉంటుంది. ఆయన అన్నాడు కనుక మళ్లీ రీ షూట్‌ చేయాలని హీరో సాయి ధరమ్‌ తేజ్‌ కూడా భావించాడు. త్వరలోనే రీ షూట్‌ను ప్రారంభించి, వచ్చే డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారు. రీ షూట్‌తో అయిన ‘జవాన్‌’ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడేమో చూడాలి.

Exit mobile version