Site icon TeluguMirchi.com

థియేటర్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఏ రేంజ్ లో రచ్చ చేసారో చూడండి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 15 న వరల్డ్ వైడ్ గా తెలుగు , తమిళ్ , హిందీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేశారు. హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్ధం అవుతుంది. ప్రభాస్ యాక్షన్..శ్రద్ద గ్లామర్..యువి నిర్మాణం..సుజిత్ టేకింగ్ ఇవ్వాలని టీజర్ లో హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ , సోషల్ మీడియా లో సంచలనం రేపుతోంది.

ఈ నేపథ్యంలో ఓ వీడియో శ్రద్ధను సర్‌ప్రైజ్‌ చేసింది. గురువారం తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో ‘సాహో’ టీజర్‌ను ప్రదర్శించారు. టీజర్‌ చూస్తూ అభిమానులు ఈలలు వేస్తూ, కాగితాలు ఎగరేస్తూ రచ్చ చేశారు. ఆ సమయంలో తీసిన వీడియోను శ్రద్ధ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘ప్రభాస్‌తో, సుజీత్‌తో కలిసి పనిచేయడం ఓ కలలా ఉంది. చిత్రబృందం పడిన రెండేళ్ల కష్టానికి ఈ రకమైన స్పందన చూసి చాలా సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు’ అని తెలిపింది.

Exit mobile version