Site icon TeluguMirchi.com

సాహో కేరళ , తమిళనాడు ప్రీ రిలీజ్ బిజినెస్..

ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సుజిత్ డైరెక్షన్లో యువీ క్రియేషన్స్ బ్యానర్ లో దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో తెరకెక్కుతుంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడం..బాలీవుడ్ బ్యూటీ శ్రద్ద కపూర్ తో పాటు పలువురు బాలీవుడ్ నటి నటులు నటిస్తుండడం తో ఈ సినిమా ఫై నార్త్ లోను అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయి లో జరుగుతున్నట్లు సినీ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం అందుతున్న ప్రీ రిలీజ్ బిజినెస్ సమాచారం ఇలా ఉంది.

తెలుగురాష్ట్రాల్లో రూ. 120 కోట్ల వరకు సేల్ అయ్యిందని, కర్ణాటకలో రూ27 కోట్లు, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రూ. 21 కోట్లు, నార్త్ లో రూ.50 కోట్లు, ఓవర్సీస్ లో రూ.43 కోట్ల రూపాయలకు పైగా అమ్ముడు పోయినట్టు చెపుతున్నారు. ఈ స్థాయిలో బిజినెస్ జరగడం విశేషంగా చెపుతున్నారు. ఇక మొదటి రోజు ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం సినిమా చివరి దశకు చేరుకోవడం తో ప్రమోషన్స్ మొదలు పెట్టారు.

Exit mobile version