Site icon TeluguMirchi.com

సాహో దెబ్బకు ఆ రెండు సినిమాలు విలవిలాడుతున్నాయి..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుండి వస్తున్న తాజా చిత్రం సాహో. సుజిత్ డైరెక్షన్లో భారీ యాక్షన్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయినా టీజర్ అన్ని భాషల్లో సరికొత్త రికార్డు వ్యూస్ సాధించి సినిమా ఫై ఏ రేంజ్ లో ఆసక్తి తో ఉన్నారో చెప్పకనే చెప్పాయి. ఈ సాహో వల్ల ఇద్దరు టాప్ హీరోలు టన్షన్ లో పడుతున్నట్లు సమాచారం.

సాహో కేవలం తెలుగు లోనే కాకుండా హిందీ , తమిళ్ భాషల్లో కూడా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో సూపర్ హిట్ అయినా పింక్ చిత్రాన్ని తమిళంలో అజిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బోనికపూర్ నిర్మిస్తున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 10 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ..సాహో కు దీనికి కేవలం ఐదు రోజులు మాత్రమే గ్యాప్ ఉండడం వల్ల థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్లకు ఇబ్బంది అవుతుందని..జులై నెలలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చూస్తున్నారు. అలాగే సూర్య నటించిన సినిమాను సైతం జులై నెలలోనే థియేటర్స్ లోకి తీసుకరావాలని అనుకుంటున్నట్లు సమాచారం. మొత్తం మీద సాహో వల్ల ఆ ఇద్దరు ఇబ్బంది పడుతున్నారు.

Exit mobile version