Site icon TeluguMirchi.com

ఈ ఏడాది లో ప్రభాస్ సినిమా లేనట్లే..?

బాహుబలి తర్వాత యాంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో బాలీవుడ్ భామ శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. వాస్తవానికి ఈ మూవీ ని ఈ వేసవి లో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండే..కానీ షూటింగ్ లేట్ దసరా , లేదా దీపావళి లో ఈ మూవీ రావొచ్చు అని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ ప్రస్తుత సమాచారం వింటే ఈ ఏడాది లో ఈ మూవీ రిలీజ్ కావడం లేదట..వచ్చే ఏడాది 2019 సంక్రాంతికి ఈ మూవీ వస్తుందని అంటున్నారు.

ఈ నిర్ణయం వెనక ప్రధాన కారణం షూటింగ్ లో ఆలస్యం కావడమే అని సమాచారం. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన దుబాయ్ షెడ్యూల్ ఇంకా మొదలు కాలేదు. ఈ నెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలో దుబాయ్ షెడ్యూల్ స్టార్ట్ అవొచ్చు అంటున్నారు. ఆ తర్వాత రొమేనియా షెడ్యూల్ ఉంటుంది. దుబాయ్ షెడ్యూల్ దాదాపు నెల రోజులు ప్లాన్ చేశారు. ఆ తర్వాత రొమేనియా షెడ్యూల్ కూడా మరో నెల రోజులు ఉంటుంది. ఈ రెండు షెడ్యూల్ సజావుగా సాగితే బాగుంటుందని కానీ ఆలా జరగకపోతే మరిన్ని రోజులు పోస్ట్ పోనే ఆయె ఛాన్స్ ఉంది. మొత్తం మీద ప్రభాస్ అభిమానులు ఈ ఏడాది వెండి తెర ఫై తమ అభిమాన నటుడిని చూడలేరు అనేది సత్యం.

Exit mobile version