బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దుబాయి లో ఈ మధ్యనే మొదలయ్యింది. ఈ షెడ్యూల్లో కొన్ని రిస్కీ స్టంట్స్ తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. బుర్జ్ ఖలీఫా, రాస్ అల్ కైమా, వరల్డ్ ట్రేడ్ సెంటర్ ప్రాంతాలలో ప్రభాస్పై చేజింగ్ సీన్స్ తీస్తున్నారు. దానికి సంబంధించిన స్టిల్స్ గతం లో సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా తాజాగా మరికొన్ని పిక్స్ ను నటుడు అరుణ్ విజయ్ తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు షేర్ చేసారు.
అరుణ్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాదు సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ , జాక్ ష్రాఫ్ , చుంకీ పాండే,అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఫై తెరకెక్కుతున్న ఈ మూవీ లో ప్రభాస్ సరసన శ్రద్ద కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.