సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న సాహో లొకేషన్ పిక్స్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం సాహో. ఆగస్టు 15 న తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో భారీ ఎత్తున విడుదల కాబోతుంది. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న సాంగ్స్ ను పూర్తి చేస్తున్నారు చిత్ర యూనిట్. ఇందుకు యూరప్ కు వెళ్లారు చిత్ర యూనిట్. అక్కడ అందమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే షూటింగ్ గ్యాప్ లో ప్రభాస్.. శ్రద్దా కపూర్ తదితరులు ఆస్ట్రియాలో ఫుల్ గా తిరుగుతూ.. షాపింగ్ చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు డార్లింగ్..ఎప్పుడు వస్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కడం జరిగింది. బాలీవుడ్ టాప్ నటి నటులు ఈ సినిమాలో నటించడం తో నార్త్ లోను ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.