Site icon TeluguMirchi.com

మంచు కొండల్లో ప్రభాస్ పాట..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం సాహో. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో ఏక కాలంలో ఈ మూవీ ఆగస్టు 15 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం మిగిలి ఉన్న పాటల షూటింగ్ జరుపుకుంటుంది. అందులో భాగంగా ప్రస్తుతం ఆస్ట్రియాలో పాటని పూర్తీ చేసారు.

1368 అడుగుల ఎత్తున్న మంచు కొండలపైకి కేబుల్‌ కార్లలో వెళ్లి ఈ పాటను పూర్తి చేశారట. బాలీవుడ్‌కి చెందిన ప్రముఖ డాన్స్ మాస్టర్ వైభవి మర్చంట్‌ నేతృత్వంలో ప్రభాస్‌, శ్రద్ధాకపూర్‌లపై పాటని తెరకెక్కించారు. సుందరమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవబోతోందని, జిబ్రాన్‌ ప్రపంచస్థాయి నాణ్యతతో నేపథ్య సంగీతం అందిస్తున్నారని చిత్రవర్గాలు చెపుతున్నాయి. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ మూవీ భారీ బడ్జెట్ తో నిర్మించబడుతుంది.

Exit mobile version