Site icon TeluguMirchi.com

సాహో ప్రెస్ మీట్ హైలైట్స్..

ప్రభాస్ – సుజిత్ కలయికలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సాహో. యువీ క్రియేషన్స్ బ్యానర్ ఫై దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించబడిన ఈ మూవీ ఆగస్టు 30 న తెలుగు, తమిళ్ , హిందీ , మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండడం తో చిత్ర యూనిట్ ప్రమోషన్ జోరు పెంచారు. ఆదివారం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పటు చేసి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ ప్రెస్ మీట్ కు ప్రభాస్ , శ్రద్ద కపూర్ , నిర్మాత ప్రమోద్, దర్శకుడు సుజిత్ హాజరయ్యారు.

ప్రభాస్ మాట్లాడుతూ..ట్రైలర్ కోసం 134 కట్స్ చేశామని, పాటల సౌండింగ్ కొత్తగా ఉందని చాలా కష్టమైందని తెలిపాడు. శ్రద్ధా కపూర్ యాక్షన్ సన్నివేశాల్లో చాలా బాగా చేసిందని, సినిమాలో యాక్షన్ లవ్ స్టోరీని చూపిస్తామని వెల్లడించాడు. సాహో‌పై బాహుబలి ప్రభావం ఎంతలా పడిందని అడగ్గా.. భారీగానే పడిందని, బడ్జెట్ కూడా ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందని ప్రభాస్ తెలిపాడు. బాహుబలి ఫ్యాన్స్‌కు వినోదం అందించడమే తమ లక్ష్యమని అన్నాడు. ఈ సినిమా తర్వాత మీరు బాలీవుడ్ బాద్‌షా అవుతారా? అని ప్రభాస్‌ను అడగ్గా.. అది చాలా పెద్ద పదం అని తాను ఎంత ఒదిగి ఉంటానో చెప్పుకొచ్చాడు. సాహో ట్రైలర్ చూసిన సినీ ప్రముఖులు కూడా బాగా స్పందించారని ప్రభాస్ తెలిపాడు. సాహో ట్రైలర్ చూసి చిరంజీవి తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. అది చూసి తాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని అన్నాడు. వెంటనే ఆయనకు ఫోన్ చేశానని యంగ్ రెబల్ స్టార్ కామెంట్ చేశాడు. ఇది తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నాడు. దర్శకుడు రాజమౌళికి కూడా సాహో ట్రైలర్ నచ్చిందని…ఆయన కూడా తనకు మెసేజ్ చేశారని ప్రభాస్ వివరించాడు.

శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ.. బహు భాషల్లో వస్తున్న ఈ సినిమాలో తాను భాగస్వామి కావడం ఆనందంగా ఉందని తెలిపింది. ప్రభాస్ అమేజింగ్ కోస్టార్ అని, జెన్యూన్‌గా ఉంటాడని వెల్లడించింది.

Exit mobile version