సెంచూరియన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారతజట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో దక్షిణాఫ్రికా జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. మణికట్టు స్పిన్ ద్వయం యజువేంద్ర చాహల్ (5/22), కుల్దీప్ యాదవ్ (3/20) దెబ్బకు ఆతిథ్య జట్టు 32.2 ఓవర్లకు 118 పరుగులకే కుప్పకూలింది. సెంచూరియన్ తమ సొంత అడ్డా అన్నట్టు విరుచుకుపడ్డారు ఈ స్పిన్నర్లు. గింగిరాలు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను విలవిల్లాడించారు
సఫారీ బ్యాటింగ్
ఆమ్లా – 23, కాక్ – 20, మార్క్రమ్ -8, డుమిని -25, మిల్లర్ – 0, జోండో – 25, మోరిస్ -14, రబడా -1 , మోర్కెల్ -1, ఇమ్రాన్ తహీర్ – 0, షంశీ – 0
భారత్ బౌలింగ్ :
భువనేశ్వర్ కుమార్ – 1, బుమ్రా -1, చాహల్ – 5, కులదీప్ యాదవ్ – 3