Hanu Man : ప్రతి టికెట్ పై రూ.5 ఆ రాములవారికే..!


క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ కథానాయకుడిగా సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ‘హను-మాన్’. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ‘హను-మాన్’ గ్లోబల్ లెవల్ లో క్రేజ్ సంపాదించుకుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో మెగా ప్రీ రిలీజ్ ఉత్సవ్ ని నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ వేడుకలో ఒక మంచి అనౌన్స్అమెంట్ అయితే చేసింది చిత్రబృందం. అదేంటంటే హను-మాన్ చిత్రం ఆడినన్ని రోజులు వచ్చే కలెక్షన్స్ లో ప్రతి టికెట్ పై రూ.5 అయోధ్య రామమందిరానికి ఇవ్వాలని హనుమాన్ చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారితో అనౌన్స్ చేపించారు. ఇది చాలా గొప్ప నిర్ణయం. హనుమంతుని ఆశీస్సులు చిత్ర బృందానికి నిండుగా వుంటాయి. ఆ పుణ్యం దక్కుతుంది. అది అందరికీ వరమై ఈ చిత్రం విజయం సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని చిరంజీవి గారు తెలిపారు.