Site icon TeluguMirchi.com

డబ్బులివ్వకుంటే తప్పుడు ప్రచారం చేస్తాడట!

rojaసినీ నటి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా తనకు ప్రాణభయం ఉందంటూ రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. డబ్బుల కోసం తన సోదరుడు వై.రామ్‌ప్రసాద్‌రెడ్డి, అతని మేనేజర్‌ ప్రసాదరాజు తనను వేధిస్తున్నారని, వారి వల్ల తనకు ప్రాణభయం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతను ఏదో ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడని, అందులోంచి బయట పడేందుకు తనను వేధిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే తనపై తప్పుడు ప్రచారం చేస్తామంటూ రామ్‌ప్రసాద్‌రెడ్డి, ప్రసాదరాజు బెదిరిస్తున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. తాను 22ఏళ్ల సినిమా కెరీర్‌లో సంపాదించినదంతా రామ్‌ప్రసాద్‌రెడ్డి దోచేసి తనను నడిరోడ్డుపై వదిలేశాడని ఆరోపించారు.

Exit mobile version