కొన్ని సందర్బాల్లో ఆటలో చిన్న చిన్న తప్పులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నామినేషన్ పక్రియ జరుగుతున్న సమయంలో దాని గురించి చర్చించుకోవడం అనేది రూల్ కాదు అంటూ పదే పదే ఇంటి సభ్యులకు బిగ్బాస్ చెప్పినా కూడా మొన్నటి సోమవారం నాడు శివజ్యోతి మరియు రోహిణిలు నామినేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. వారిద్దరిలో శివజ్యోతి నామినేట్ అవ్వగా, రోహిణి సేఫ్ అయ్యింది. అయితే రోహిణి, శివ జ్యోతి నామినేషన్ పక్రియ గురించి చర్చించిన కారణంగా వారిద్దరిని కూడా రెండు వారాలకు డైరెక్ట్ నామినేట్ చేయడం జరిగింది.
ఎలిమినేషన్లో ఏడుగురు ఉండగా చివరికి రాహుల్ మరియు రోహిణిల పేర్లు మిగిలాయి. వీరిద్దరిలో రాహుల్ను సేవ్ చేసి రోహిణి ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. ఒకవేళ రోహిణి ఆ తప్పు చేయకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా రాహుల్ నిన్న ఎలిమినేట్ అయ్యేవాడు. ఇక ఈవారం పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకుని, నలుగురు కంటెస్టెంట్స్ బయటకు వెళ్లి పోయారు. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి.