Site icon TeluguMirchi.com

మళ్ళీ మాట మార్చిన వర్మ


‘జీఎస్‌టీ’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మను సీసీఎస్‌ పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఆయన ల్యాప్‌టాప్‌ సీజ్‌ చేశారు. సామాజిక కార్యకర్త దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వర్మను విచారణకు పిలిచిన పోలీసులు ఆయన్ని సుదీర్గంగా విచారించారు. అయితే ఈ విచారణలో తాను ‘జీఎస్‌టీ’ని తీయలేదని చెప్పుకొచ్చాడు వర్మ .

ఇప్పుడు మళ్ళీ మాట మార్చాడు. ”ఎస్టీ’ వెబ్‌సిరీస్‌ను నేను డైరెక్ట్‌ చేయలేదని కేవలం సాంకేతిక అంశాలకు మాత్రమే సహకరించినట్లు చెప్పానని నాపై తప్పుడు వార్తలు వెలువడుతున్నాయి. నేను తీసిన సినిమాను తీయలేదని ఎందుకు చెప్తాను? సినిమాను నేనే డైరెక్ట్‌ చేసినట్లు సిరీస్‌లో ఉందిగా?” అని ట్వీట్ చేశారు వర్మ.

Exit mobile version