వైవిఎస్ చౌదరికి ఏమీ కలసి రావడం లేదు. ’రేయ్’ సినిమా పూర్తయినా ఇంత వరకూ ప్రేక్షకుల ముందుకు తీసుకురాలేకపోయాడు. ఇప్పుడు ఆడియోకీ విఘ్నాలు ఎదురవుతున్నాయి. ’రేయ్’ పాటల్ని ఆదివారం విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకొన్నాడు. పవన్ కల్యాణ్ ని కూడా అతిథిగా పిలిచాడు. శిల్పకళావేదిక బుక్ చేసుకొన్నాడు. అన్నీ ఓకే.. కానీ ఇప్పుడు సడన్ గా ఈ పోగ్రాం వాయిదా పడింది. జనవరి రెండో వారంలో పాటల్ని విడుదల చేస్తారట. పవన్ హ్యాండిచ్చాడని.. అందుకే ఈ వేడుక వాయిదా పడిందని టాక్. పాపం.. చౌదరి..!