చార్మినార్ లో ‘రేసు గుర్రం’

resugurramఅల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రేసుగుర్రం’. శ్రుతి హాసన్ హీరోయిన్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చార్మినార్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. చార్మినార్లో జరుగుతున్నా షెడ్యూల్ తో షూటింగ్ దాదాపు పూర్తవుతుంది. ఇక  ఇటీవల విడుదలైన  ‘రేసు గుర్రం’ టీజర్ దుమ్ము రేపుతోంది. తమన్  మ్యూజిక్ అందిస్తున్నాడు. బన్నీ కి తమన్ మ్యూజిక్ అందించడం ఇదే తొలి సారి. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.