రెండు రోజులు ఆల‌స్యం

Race-gurram-Audio-releaseఅల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘రేసుగుర్రం’. శ్రుతిహాస‌న్, స‌లోని క‌థానాయిక‌లు. సురేంద‌ర్‌ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందించారు. పాట‌ల పండుగ ఈరోజు జ‌ర‌గాల్సింది. 14న ఆడియో విడుద‌ల చేస్తామ‌ని టీమ్ ప్ర‌క‌టించింది. అయితే రెండు రోజులు ఆల‌స్యంగా.. అంటే 16న పాట‌ల్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ ఆల‌స్యానికి కార‌ణం.. ప‌వ‌న్ పార్టీ ప్ర‌క‌ట‌నే. స‌రిగ్గా 14న ప‌వ‌న్ పార్టీ ప్రెస్ మీట్ పెట్ట‌డానికి ముహూర్తంగా నిర్ణ‌యించుకోవ‌డంతో ప‌వ‌న్ వెనుక‌డుగు వేయ‌క త‌ప్ప‌డం లేదు. ఏప్రిల్ 12న ‘రేసుగుర్రం’ సినిమాని విడుద‌ల చేయ‌డానికి చిత్ర‌బృందం స‌న్నాహాలు చేస్తోంది.