పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. రేణూ దేశాయ్ రాసిన ఓ కవిత సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. పరోక్షంగా పవన్ గురించే రేణు ఆ కవిత రాశారని పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఓ అభిమాని ట్విటర్ ద్వారా రేణుకు హెచ్చరిక చేశాడు.
`మీ వల్ల పవన్ కల్యాణ్ రాజకీయంగా టార్గెట్ అవుతున్నారు. పూర్తి అవగాహన లేకుండా మీరు చేస్తున్న కామెంట్లను మీడియా హైలెట్ చేస్తోంది. మీ పని మీరు చేసుకుంటూ సంతోషంగా ఉండండి. కల్యాణ్ సర్ గురించి ఎలాంటి పోస్టులూ షేర్ చేయవద్దని సూచించాడు.
దీంతో ఆ అభిమానిపై రేణూ సీరియస్ అయ్యారు. `నిజంగానా? నాకు సంబంధించి నేను రాసుకున్న కవిత వల్ల ఆయన ఎందుకు `టార్గెట్` అవుతారు. నా సోషల్ మీడియా ఖాతాలో జోలికి రాకుండా మీ పని మీరు చూసుకోండి. సోషల్ మీడియాలో నా పోస్టుల గురించి ఇలా సంస్కార హీనంగా స్పందించకండి” ఘాటుగా స్పదించింది రేణు.