Site icon TeluguMirchi.com

టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న రెడ్ ..

ఇస్మార్ట్ శంకర్ చిత్రం తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మళ్లీ ఫామ్ లోకి వచ్చిన హీరో రామ్..ప్రస్తుతం కిషోర్ తిరుమల డైరెక్షన్లో రెడ్ అనే సినిమా చేస్తున్నాడు. తమిళ మూవీ తాడం కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతుంది. రామ్ మొదటి సారి ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ చేస్తున్నారు.

నివేదా పేతు రాజ్ మెయిన్ హీరోయిన్ గా చేస్తుండగా మాళవికా మోహన్, అమృత అయ్యర్ మరో ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకొని..ఇటలీ లో సాంగ్స్ షూట్ లో బిజీ గా ఉన్నారు. ఏప్రిల్ 09 న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్‌పై ‘స్రవంతి’ రవికిషోర్ నిర్మిస్తున్నారు.

Exit mobile version