రవితేజ ‘వెంకీ’ రీ రిలీజ్ డేట్ ఫిక్స్..


మాస్ మహారాజా రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమా 2004లో విడుదలై సూపర్ హిట్ ను అందుకుంది. ఇక శ్రీను వైట్ల దర్శకత్వంలో, స్నేహ కథానాయకిగా వచ్చిన ఈ సినిమాలో క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ సీన్స్ కు కొదవే లేదు. అంతేకాదు వెంకీ లో కామెడీ సన్నివేశాలు మీమ్స్ రూపంలో ఎంతలా ఫేమస్ అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలోని ట్రైన్ కామెడీ ఎపిసోడ్ చాలా మందికి ఫేవరెట్‍గా ఉంటుంది. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతుంది.

ఇకపోతే గత కొద్దీ రోజులుగా వెంకీ మూవీని కూడా రీ రిలీజ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు అందరు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వెంకీ’ మూవీ రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేసారు చిత్ర నిర్మాతలు. ఈ ఏడాది డిసెంబర్ 30వ తేదీన వెంకీని థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్టు శ్రీమాతా క్రియేషన్స్ ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. మరి ఈసారి ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఇకపోతే రవితేజ, బ్రహ్మానందం, శ్రీనివాస రెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర మధ్య కామెడీ సీన్లు ఈ సినిమాకు ప్రధానమైన హైలైట్.

రామ్ చరణ్ కూతురి కోసం ప్రత్యేక రూమ్.. ఎలా ఉందో తెలుసా ?