రష్మిక మందన ప్రధాన పాత్రలో ‘రెయిన్‌బో’..


ఖాకీ, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ మరో అద్భుతమైన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. రష్మిక మందన ప్రధాన పాత్రలో రొమాంటిక్ ఫాంటసీ ఎంటర్ టైనర్ ‘రెయిన్‌బో’ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు. ఇక నూతన దర్శకుడు శాంతరూబన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్ కొట్టగా, అల్లు అరవింద్ కెమరా స్విచాన్ చేయగా, సురేష్ బాబు స్క్రిప్ట్ అందించారు. నటుడు దేవ్ మోహన్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

ప్రారంభోత్సవం సందర్భంగా రష్మిక మాట్లాడుతూ.. ‘రెయిన్‌బో’ కోసం చాలా ఎక్సయిటెడ్ గా వున్నాను. దర్శకుడు శాంతరూపన్ అద్భుతమైన కథతో వచ్చారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలకు కృతజ్ఞతలు. టీం అందరితో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను అన్నారు.

దేవ్ మోహన్ మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకుల అభిమానానికి కృతజ్ఞతలు. నా మొదటి సినిమా శాకుంతులం విడుదలకు ముందే ఈ సినిమా ప్రారంభం కావడం ఆనందంగా వుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మాతలు ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు గారికి థాంక్స్. దర్శకుడు ఈ కథ చెప్పినపుడే ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా మీ అందరినీ అలరిస్తుంది’’ అన్నారు. కాగా, ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7 నుండి ప్రారంభం కానుంది.