Site icon TeluguMirchi.com

రష్మిక ఆకలి వేస్తే ఏ బిస్కెట్లు తింటుందో తెలుసా..?

గీత గోవిందం చిత్రం తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న రష్మిక..తాజాగా మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో నటించి హిట్ అందుకుంది. ప్రస్తుతం నితిన్ తో భీష్మ చిత్రం లో నటించింది. ఈ మూవీ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ లలో పాల్గొన్న నితిన్ ..రష్మిక గురించి ఓ వార్త చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు.

‘మాములుగా మనం ఆకలేస్తే చిప్స్, సమోసాలు, చాక్లెట్లు వాగేరా తింటాం.. కానీ రష్మికకు ఆకలి వేస్తే కుక్క బిస్కెట్లు తింటుందని’ అన్నాడు. మరి ఇది నిజంగా జరిగిందా..? లేక తమాషా కోసం నితిన్ అలా అన్నాడా..? లేక ఇది సినిమాలో సీన్ కు సంబంధించిందా.. ? అన్నది తెలియాల్సి ఉంది. మణిశర్మ తనయుడు మహతి మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ లో ఒక కీ రోల్ లో హెబ్బా పటేల్ నటిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నారు.

Exit mobile version