Site icon TeluguMirchi.com

రంగస్థలం.. అప్పుడే అయిపోలేదు


సుకుమార్ కి ఒక అలవాటు వుంది. తీసిన షాటే మళ్ళీ మళ్ళీ తీయడం. రష్ మొత్తం ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చి అక్కడ మళ్ళీ కొత్తగా డైరెక్ట్ చేయడం. ఆయనతో పనిచేసిన ఎవరిని అడిగినా ఈ మాటలో చెబుతారు. ఇప్పుడు రంగస్థలం విషయం విషయంలో కూడా ఇదే జరుగుతుంది,

తాను తీసిన సీన్ల‌నే మ‌ళ్లీ రీషూట్లు చేసుకుంటూ కూర్చుంటున్నాడు సుకుమార్‌. దానికి తోడు చిరంజీవి కూడా కొన్ని మార్పులు చెప్పారట. దాంతో ఈ రీపేర్లు ఇంకాస్త గ‌ట్టిగానే జ‌రుగుతున్నాయి. షూటింగ్ అయిపోయింద‌నుకుంటున్న ద‌శ‌లో ఇప్పుడు కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాల‌కు రిపేర్లు మొద‌లెట్టారు. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం రంగ‌స్థ‌లం రీషూట్లు సాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్‌ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version