సుకుమార్ కి ఒక అలవాటు వుంది. తీసిన షాటే మళ్ళీ మళ్ళీ తీయడం. రష్ మొత్తం ఎడిటింగ్ టేబుల్ దగ్గరికి తెచ్చి అక్కడ మళ్ళీ కొత్తగా డైరెక్ట్ చేయడం. ఆయనతో పనిచేసిన ఎవరిని అడిగినా ఈ మాటలో చెబుతారు. ఇప్పుడు రంగస్థలం విషయం విషయంలో కూడా ఇదే జరుగుతుంది,
తాను తీసిన సీన్లనే మళ్లీ రీషూట్లు చేసుకుంటూ కూర్చుంటున్నాడు సుకుమార్. దానికి తోడు చిరంజీవి కూడా కొన్ని మార్పులు చెప్పారట. దాంతో ఈ రీపేర్లు ఇంకాస్త గట్టిగానే జరుగుతున్నాయి. షూటింగ్ అయిపోయిందనుకుంటున్న దశలో ఇప్పుడు కొన్ని కీలకమైన సన్నివేశాలకు రిపేర్లు మొదలెట్టారు. హైదరాబాద్లో ప్రస్తుతం రంగస్థలం రీషూట్లు సాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. దేవిశ్రీ మ్యూజిక్ అందించాడు. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.