”రంగస్థలం” మొదటి పాట అదిరిపోయింది

రామ్‌చరణ్‌, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగస్థలం’. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మొన్న సమంత పాత్రను పరిచయం చేస్తూ ప్రత్యేకమైన టీజర్‌ను విడుదల చేశారు. దీనికి విశేషమైన స్పందన లభిస్తోంది. ఇప్పుడు ఈ సినిమా మొదటి పాట వచ్చింది. ఎంత సక్కగున్నావె.. అని సాగిన ఈ పాట చాలా క్యాచిగా వుంది.

యేరు సెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా దొరికిన లంకెబిందెలాగ ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావె..
సింత సెట్టు ఎక్కి సిగురు కోయబోతే చేతికందిన చందమామ లాగ ఎంత సక్కగున్నావె లచ్చిమి ఎంత సక్కగున్నావె
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగా ఎంత సక్కగున్నావె ముత్తయిదువుల మెళ్లో పసుపు కొమ్ములాగ ఎంత సక్కగున్నావె
చుక్కలసీర కట్టుకున్న వెన్నెల లాగ ఎంత సక్కగున్నావె .. అనే లిరిక్స్ తో సాగిన ఈ పాట వినగానే ఎక్కేసిందని చెప్పొచ్చు.

మైత్రీ మూవీ మేకర్స్‌ ‘రంగస్థలం’ సినిమాను నిర్మిస్తోంది. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.