Site icon TeluguMirchi.com

ఉత్తరాంధ్ర లో ‘చిట్టిబాబు’ హావ

నాల్గు వారాలు కావొస్తున్నా చిట్టిబాబు హవా ఏ మాత్రం తగ్గడం లేదు. సుకుమార్ – రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం మూవీ లో చిట్టిబాబు గా చరణ్ నటన కు అభిమానులే కాదు సినీ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. ఒకటికి రెండు సార్లు ఈ మూవీ ని చూసేందుకు థియేటర్స్ వైపు పరుగులు పెట్టారు. దీంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామి సృష్టించింది.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం ఉత్తరాంధ్ర ఏరియాలో ఇప్పటివరకు రూ.12.2 కోట్ల షేర్ కొల్లగొట్టిందని సినీ విశ్లేషకులు చెపుతున్నారు. సుకుమార్ అద్భుత టేకింగ్, రంగమ్మ అత్తగా అనసూయ నటన, దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్, రత్నవేలు కెమెరా పనితనం , సమంత – చరణ్ ల ప్రేమాయణం ఇలా అన్ని కూడా సినిమాకు హైలైట్స్ గా నిలిచాయి. దీంతో విడుదలైన అన్ని చోట్ల మంచి కలెక్షన్స్ రాబడుతూ 50 రోజుల వైపు పరుగులు పెడుతుంది. మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ఈ సినిమాని నవీన్ యెర్నేని, మోహన్, రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Exit mobile version