రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ”అవును”. ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. డి.సురేష్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ కొనసాగింపు చిత్రంలో రానా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నటిస్తోంద రానా కాదట. రాణె.. అదేనండీ హర్షవర్థన్ రాణె. తొలి సినిమాలో రాణె నటించాడు. ఇప్పుడు అతనితోనే సీక్వెల్ చేయాలని డిసైడ్ అయ్యారు. అయితే కమ్యునికేషన్ గ్యాప్ వల్ల… రాణెని రానాగా భావిస్తోంది మీడియా. అందుకే ఈ విషయాన్ని సురేష్ బాబు స్పష్టం చేస్తూ.. ”ఈ సినిమాలో నటిస్తోంది రానా కాదు. రాణె. అవును గురించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తా..” అంటున్నారు.