పాక్ నటుడు ఈ సినిమాలో నటించడం తో ఈ సినిమా రిలీజ్ చేయకూడదని నాల్గు రాష్ట్రాల థియేటర్స్ యాజమాన్యం పిలుపునివ్వడంతో హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి సైతం నిర్మాతలు తీసుకెళ్లారు. స్పందించిన ఆయన ధియేటర్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసేలా చూస్తానని హామీ కూడా ఇచ్చారు. మహారాష్ర్ట, గోవా, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో యే దిల్ హై ముష్కిల్ చిత్రాన్ని విడుదల చేయకూడదని సినిమా ఓనర్స్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్ణయించుకుంది. దీంతో ప్రభుత్వం దిగివచ్చిన థియేటర్స్ యాజమాన్యం మాత్రం దిగిరావడం లేదని బాధ పడుతున్నాడట.