Site icon TeluguMirchi.com

రాజీవ్‌గాంధీ హత్య కేసులో రానా

మొదటి నుండి వైవిధ్యమైన ప్రయాణం చేస్తున్నాడు రానా. ప్రస్తుతం ప్రస్తుతం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ లోనూ ఓ వెరైటీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మరో కొత్త తరహా కధకు ఓకే చెప్పాడు. తన తదుపరి చిత్రంలో రానా సీబీఐ అధికారిగా నటించబోతున్నాడు రానా.

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసును సీబీఐ విచారణ జరిపింది. దీనికి పోలీసు అధికారి డాక్టర్‌ కార్తికేయన్‌ ప్రధాన అధికారిగా వ్యవహరించారు. ఆయన పాత్రలో రానా నటిస్తారని తెలుస్తోంది. ‘బాహుబలి’ తర్వాత రానాకు మంచి ఇమేజ్‌ రావడంతో ఈ పాత్రకు ఆయనే సరిపోతారని యూనిట్ భావించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ, మళయాళ భాషల్లో రూపొందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబధించిన ప్రకటన రానుంది.

Exit mobile version