చిరు సినిమా ఫై రానా క్లారిటీ ఇచ్చాడు.

బాహుబలి మూవీ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దగ్గుపాటి రానా…తాజాగా మెగా స్టార్ చిరంజీవి నటించబోయే 151 వ సినిమా ‘ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి ‘ లో ఓ స్పెషల్ రోల్ లో నటిస్తున్నాడనే వార్త వారం రోజులు గా మీడియా లో చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే.

ఈ నేపథ్యం లో ఆ వార్త ఫై రానా క్లారిటీ ఇచ్చాడు.. చిరు సినిమా లో నటిస్తున్నానన్నది మాత్రం అబద్ధమని రాణా తేల్చి చెప్పాడు. ఇంతవరకు ఆ సినిమా యూనిట్ తనను సంప్రదించలేదని రాణా స్పష్టం చేశాడు. దీంతో ‘ ఉయ్యాలవాడ ‘ లో రానా నటిస్తున్నాడనే వార్త ఫై ఓ క్లారిటీ వచ్చేయడం తో అభిమానులు కూల్ అయ్యారు. మరి ఒకవేళ చిత్ర యూనిట్ రానా దగ్గరికి వెళ్తే నటించడానికి రెడీ గా ఉన్నానని చెప్పకనే చెప్పాడు రానా.

ప్రస్తుతం రానా తేజ దర్శకత్వం లో ‘నేనే రాజు నేనే మంత్రి ‘ అనే మూవీ లో నటిస్తున్నాడు. సురేష్ బాబు నిర్మాణం లో తెరకెక్కుతున్న ఈ మూవీ లో రానా కు జోడిగా కాజల్ నటిస్తుంది. ఆగస్టు లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.