కాగా ఈ వార్తల్లో నిజంలేదని , అవన్నీ ఎవరో కావాలని సృష్టించారు తప్ప అందులో వాస్తవం లేదని తన ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు. మోహన్ లాల్ గారితో సినిమా చేయడం పెద్ద గౌరవంగా భావిస్తానని, కానీ ఇప్పుడైతే ఆయనతో ఎలాంటి సినిమా ప్లాన్ చేయలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రానా బాహుబలి 2 చిత్రం తో పాటు , 1971 లో ఇండియా – పాక్ ల మధ్య జరిగిన సబ్ మెరైన్ వార్ నైపథ్యంలో ‘ఘాజి’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాప్సి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాను పివిపి సంస్థ నిర్మిస్తుంది.