‘ఆదిపురుష్’ నుంచి లేటెస్ట్ అప్డేట్..


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ రామునిగా, కృతి సీతగా కనిపించనున్నారు. అలాగే సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా ‘ఆదిపురుష్’ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో సీతారాములుగా ప్రభాస్, కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు.. అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. ఇక జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.