Site icon TeluguMirchi.com

శ్రీ‌నువైట్లతో సై అంటున్న చ‌ర‌ణ్‌

vaitla
రామ్‌చ‌ర‌ణ్ – శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. డి.వి.వి.దాన‌య్య ఈ చిత్రానికి నిర్మాత‌గా వ్యవ‌హ‌రిస్తారు. గోవిందుడు అంద‌రివాడేలే… పూర్తయిన వెంట‌నే ఈ చిత్రం ప్రారంభం కానుంది. సెప్టెంబ‌రులో కొబ్బరి కాయ్ కొట్టుకోనున్నట్టు తెలుస్తోంది. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌కి శ్రీ‌నువైట్ల క‌థ వినిపించారు. దానికి చ‌ర‌ణ్ ఎగ్జైట్ అయి `వెంట‌నే ఈ సినిమా చేసేద్దాం` అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గోవిందుడు అంద‌రివాడేలేతో స‌మాంత‌రంగా ఈసినిమా ప్రారంభించాల‌నుకొన్నారు. కానీ శ్రీ‌నువైట్ల కాస్త స‌మ‌యం అడ‌గ‌డంతో సెప్టెంబ‌రు వ‌ర‌కూ ఆగాల్సి వ‌చ్చింది. చ‌ర‌ణ్ కోసం ఓ పూర్తి స్థాయి క‌మ‌ర్షియ‌ల్ క‌థ‌ను శ్రీ‌నువైట్ల డిజైన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Exit mobile version