తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ రాబోతోందా? వెంకటేష్, రామ్ చరణ్ ఇద్దరూ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారా? గత కొంతకాలంగా ఈ టాపిక్ చిత్రసీమలో హాట్ టాపిక్. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని, సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమాలో నటిస్తున్నారని, ఈ సినిమాకి త్రయం అనే పేరు పెట్టారని చెప్పుకొంటున్నారు. చాలామంది ఈ వార్తని లైట్గా తీసుకొన్నారు. అయితే తుఫాన్ ఆడియోకి వెంకటేష్ రావడంతో – ఈ సినిమా ఉన్నట్టే అనే ధీమాకు వచ్చేశారంతా. సాధారణంగా మెగా ఫ్యామిలీ హీరోల సినిమా కార్యక్రమాలకు వెంకటేష్ హాజరు కారు. ఈసారి చరణ్ ఒక్క మెసేజ్ పెడితే – వెంకీ వచ్చేశారట. త్వరలో కలసి ఓ సినిమా చేస్తున్నారు, అందుకే ఇంత అనుబంధం అని సినిమా పెద్దలు గుసగుసలాడుకొంటున్నారు. అంటే ఈ సినిమా ఉన్నట్టే కదా?