Site icon TeluguMirchi.com

ఒకే వేదికపై…. చిరు, పవన్, రామ్ చరణ్,బన్నీ

చిరంజీవీ, పవన్ కళ్యాన్ మధ్య విబేధాలు వచ్చాయని, అందుకే… దూరంగా ఉంటున్నారని పరిశ్రమలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న వేళ… వాటికి ముగింపు పలికే అవకాశం ఈ అన్న దమ్ములకు వచ్చింది. ‘నాయక్’ పాటల వేడుక లో చిరు, పవన్ లు ఒకే వేదికపై కనిపించి…. అభిమానులకు కనువిందు చేయబోతున్నారు. రామ్ చరణ్ కధానాయకుడిగా నటించిన చిత్రం ‘నాయక్’. వివి వినాయక్ దర్శకత్వం వహించారు. ఈ రోజు (డిసెంబర్ 17న) ‘నాయక్’పాటల్ని హైదరాబాద్ లోని నానక్ రామ్ గుడా లో వేలాది మెగా అభిమానుల సమక్షం లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాన్ ప్రత్యేక  అతిధిగా పాల్గుంటారని సమాచారం. ‘నాయక’ కోసమే… స్పెయిన్ లో వున్న పవన్…. సోమవారం రాజధానికి చేరుకుంటారట. చిరంజీవీ, పవన్, చెర్రి, బన్నీ… ఇలా మెగా హీరోలను ఒకే వేదికపై చూసి చాలాకాలం అయ్యింది. ‘నాయక్’ ఈ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది.

Exit mobile version