‘నాయక్’ డబ్బింగ్ తో బిజీ గా ఉన్న చరణ్

nayakరామ్ చరణ్, వినాయక్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘నాయక్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. చరణ్ గత రెండు రోజులుగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగు పార్టును పూర్తి చేస్తున్నాడు. నాయక్ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 9 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ చిత్రం పట్ల అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వీవీ వినాయక్ తొలిసారిగా చరణ్ సినిమాకు దర్శకత్వం వహించడం ఈ ప్రాజక్టుకి మరింత క్రేజ్ తెచ్చింది. రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా…. అతని సరసన కాజల్ అగర్వాల్, అమలా పాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆడియో మార్కెట్లో అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. అలాగే ఈ పాటల టీజర్లు కూడా విడుదలవడం, అందులో మెగా పవర్‌ స్టార్‌ వేసిన స్టెప్పులు అభిమానూలందరితో రిలీజ్‌ ఎప్పుడెప్పుడా అనిపిస్తున్నట్టు వినికిడి. ఇది రాంచరణ్‌ కెరీర్‌ లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ గా నిలిచిపోవడం ఖాయమని దర్శకుడు వినాయక్‌ కూడ చెప్పడం “నాయక్‌” “‘ సినిమాపై మరింత క్రేజ్‌ ను పెంచుతోంది.