సినిమా సెట్స్ పైన ఉండగానే విడుదల తేదీ ప్రకటించడం, అనుకొన్న సమయానికి సినిమా తీసుకురావడం దిల్ రాజు ప్రత్యేకత. దాన్ని మరోసారి చాటుకొన్నారాయన. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రామయ్యా వస్తావయ్యా’ అనే పేరు ఖరారు చేశారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత, శ్రుతిహాసన్ కథానాయికలు. ఆగస్టు 9న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ప్రస్తుతం రాజధానిలో ఎన్టీఆర్, సమంతలపై ఓ యుగళగీతం తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి పాత్రలో కనిపించలేదని, ఎన్టీఆర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఆయనపై తెరకెక్కించిన పోరాట సన్నివేశాలు తప్పకుండా అభిమానులకు నచ్చుతాయని చిత్రబృందం ధీమాగా చెబుతోంది.