పందాలు గుర్రాలపై కాయ్.. సింహాలపై కాదు – అంటూ పవర్ ఫుల్ డౌలాగులతో గర్జిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ దసరాకి రామయ్యా వస్తావయ్యా అంటూ మురిపించడానికి సిద్ధమవుతున్నాడు. సమంత, శ్రుతిహాసన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. దిల్ రాజు నిర్మాత. అక్టోబరు 10న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్దమవుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ డబ్బింగ్ చెప్తున్నాడు. గత రెండు రోజులుగా డబ్బింగ్ థియేటర్లోనే గడుపుతున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే సెన్సార్ ముందుకు తీసుకెళ్తారు. దసరాకి ఈ సినిమా వస్తుందా, రాదా? అనే సందేహాలు ఉన్ననేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసిందీ చిత్రబృందం. చూస్తుంటే దసరాకి రామయ్యా వచ్చేలానే ఉన్నాడు.